కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 8 మంది మృతి

| Edited By:

Aug 31, 2019 | 11:39 AM

మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. ధూలే ప్రాంతంలో ఉన్న ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి 8 మంది మృతి చెందారు. మరో 26 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికిచేరుకున్న పోలీసులు, రెస్క్యూటీం సహాయక చర్యలు చేపడుతోంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సిలిండర్లు పేలడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే ఘటన జరిగిన సమయంలో పరిశ్రమలో దాదాపు 100 మందికి పైగా కార్మికులు […]

కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 8 మంది మృతి
Follow us on

మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. ధూలే ప్రాంతంలో ఉన్న ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి 8 మంది మృతి చెందారు. మరో 26 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికిచేరుకున్న పోలీసులు, రెస్క్యూటీం సహాయక చర్యలు చేపడుతోంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సిలిండర్లు పేలడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే ఘటన జరిగిన సమయంలో పరిశ్రమలో దాదాపు 100 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.