శివసేన గూటికి స్వతంత్ర ఎమ్మెల్యే

| Edited By:

Aug 12, 2020 | 10:34 AM

మహారాష్ట్ర మంత్రి, స్వతంత్ర ఎమ్మెల్యే శంకర్‌ రావ్ గదఖ్‌ శివసేన గూటికి చేరారు. ఆయన అహ్మద్‌ నగర్‌ జిల్లా నేవాసా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా గెలిచారు. ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర..

శివసేన గూటికి స్వతంత్ర ఎమ్మెల్యే
Follow us on

మహారాష్ట్ర మంత్రి, స్వతంత్ర ఎమ్మెల్యే శంకర్‌ రావ్ గదఖ్‌ శివసేన గూటికి చేరారు. ఆయన అహ్మద్‌ నగర్‌ జిల్లా నేవాసా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా గెలిచారు. ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో భూమి, జలశాఖ మంత్రిగా ఉన్నారు. మంగళవారం నాడు సీఎం ఉద్దవ్‌ థాక్రే నివాసంలో ఆయన శివసేన కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా శంకర్‌ రావుకు సీఎం ఉద్దవ్‌ థాక్రే శివ బంధన్‌ను కట్టి పార్టీలోకి ఆహ్వానం పలికారు. శివసేనా సిద్ధాంతాలకు ఆకర్షితుడినై పార్టీలో చేరినట్లు శంకర్‌ రావు తెలిపారు.

 

Read More :

ఆస్పత్రి మెడికల్‌ షాపులో అగ్నిప్రమాదం.. కరోనా రోగుల తరలింపు