హిమాచల్ ప్రదేశ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మండి జిల్లాలోని కమాండ్ ప్రాంతంలోని ఓ లోయలో జీపు బోల్తా పడింది. శుక్రవారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో జీపులో ఉన్న ముగ్గురు వ్యక్తులు మరణించారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు
చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు. జీపు అదుపుతప్పి పడిందా.. లేదా ఇతర వాహనం ఏదైనా ఢీకొనడంతో జరిగిందా అన్న కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు. ఇక మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.