జమ్ముకశ్మీర్ షోపియన్ జిల్లాలో ఇవాళ ఉదయం పోలీసులు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు టెర్రరిస్టులు మృతి చెందారు. తుర్క్ వాంగమ్ ప్రాంతలో నిర్భంద తనిఖీలు చేస్తున్న పోలీసులపైకి ఉగ్రవాదులు కాల్పులు చేయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆత్మరక్షణ కోసం భద్రతా సిబ్బంది కూడా ఎదురు కాల్పులు చేశాయి. కాగా మరికొంత మంది ఉగ్రవాదులు ఉండొచ్చనే అనుమానంతో భారత్ బలగాలు అక్కడ కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం ఇంకా ఆపరేషన్ కొనసాగుతోంది.
Jammu and Kashmir: Three terrorists neutralised in an encounter with security forces at Turkwangam area of Shopian, today. A search operation is underway. (Visuals deferred by unspecified time) pic.twitter.com/E7S6H7IRXU
— ANI (@ANI) June 16, 2020
Read More:
వాహనదారులపై అధిక భారం.. చమురుధరలపై రూ.2 పెంపు..