Agnipath protest: అపార నష్టం మిగిల్చిన అగ్నిపథ్‌ ఆందోళనలు.. ఇండియన్‌ రైల్వే ఎంత నష్టపోయిందో తెలుసా.?

|

Jun 24, 2022 | 7:12 AM

Agnipath protest: ఇండియన్‌ ఆర్మీ నియమక విధానంలో మార్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అగ్నిపథ్‌ పథకంపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ విధానాన్ని నిరసిస్తూ..

Agnipath protest: అపార నష్టం మిగిల్చిన అగ్నిపథ్‌ ఆందోళనలు.. ఇండియన్‌ రైల్వే ఎంత నష్టపోయిందో తెలుసా.?
Agnipath
Follow us on

Agnipath protest: ఇండియన్‌ ఆర్మీ నియమక విధానంలో మార్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అగ్నిపథ్‌ పథకంపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ విధానాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆర్మీ అభ్యర్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఈ ఆందోళనల్లో ఎక్కువగా రైల్వే ఆస్తులే టార్గెట్‌ అయ్యాయి. ఒక్క సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లోనే ఏకంగా రూ. 200 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. అయితే దేశ వ్యాప్తంగా రైల్వే శాఖలో అగ్నిపథ్‌ ఆందోళనలు మిగిల్చిన నష్టం ఎంతో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే. అక్షరాల రూ. వెయ్యి కోట్లు.. అవును మీరు చదివింది నిజమే, అగ్నిపథ్‌ ఆందోళనల్లో దేశ వ్యాప్తంగా ఏకంగా రూ. వెయ్యి కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది.

బిహార్, ఉత్తరప్రదేశ్‌, హిరాయాణా, పశ్చిమబెంగాల్‌తో పాటు సికింద్రాబాద్‌లోనూ భారీగా ఆస్తి నష్టం జరిగింది. అయితే ఆందోళనకారుల దాడుల్లో ధ్వంసమైన ఆస్తులతో పాటు రైళ్లు ఎక్కడికక్కడ ఆగిపోవడం వల్ల టికెట్ల డబ్బు వెనక్కు ఇచ్చేయడం కూడా నష్టానికి కారణంగా మారింది. ఒక్క టికెట్ల క్యాన్సిలేషన్ వల్లే రైల్వేకు రూ. 60 కోట్లకు పైగా నష్టం కలిగిందంటే పరిస్థితి ఎంటో అర్థం చేసుకోవచ్చు. తొలి నాలుగు రోజుల పాటు జరిగిన విధ్వంసంలో రూ. 700 కోట్ల మేరా ఇండియన్ రైల్వే నష్ట పోయినట్టు అధికారులు చెబుతున్నారు.

ఇప్పటి వరకు జరిగిన ఆందోళనల కారణంగా 612 రైళ్లు ప్రభావితం కాగా.. 602 రైళ్లు రద్దయ్యాయి. మరో 10 రైళ్లను పాక్షికంగా నిలిపివేశారు. ఈ మొత్తం నిరసనలతో ఇండియన్ రైల్వేకి దాదాపు రూ. 000కోట్ల నష్టం వాటిల్లినట్టు ఒక అంచనా. గత దశాబ్ద కాలం నుంచి చూస్తే రైల్వేకు ఇదే అతి పెద్ద నష్టం కావడం గమనార్హం.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..