జమ్ముకశ్మీర్లో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో ఇండియన్ ఆర్మీకి చెందిన జవాన్ వీరమరణం పొందారు. సౌత్ కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో నాయక్ రాజ్వీందర్ సింగ్ ముష్కరులతో యుద్ధం చేస్తూ.. భారత మాత ఒడిలో ఒరిగిపోయాడు. ఈ క్రమంలో ఆయన భౌతిక కాయానికి బుధవారం నాడు ఇండియన్ ఆర్మీ నివాళులు అర్పించింది. ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో.. జమ్ముకశ్మీర్ పోలీసులు, భద్రతా బలగాలు సౌత్ కశ్మీర్లో కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో వీరిని గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురు కాల్పులు చేపట్టాయి. అయితే ఈ ఘటనలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో భారత జవాన్ అమరుడయ్యాడు.
కాగా, గత కొద్ది రోజులుగా లోయలో రోజు ఎక్కడో ఓ చోట ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు చోటుచేసుకుంటున్నాయి.
Indian Army today paid tribute to Late Naik Rajwinder Singh, who made the supreme sacrifice in South Kashmir yesterday. In a solemn ceremony at BB Cantt, Lt Gen BS Raju, Chinar Corps Commander and all ranks paid homage to the braveheart on behalf of the proud nation: Army pic.twitter.com/DFPbDxbzS9
— ANI (@ANI) July 8, 2020