అమరుడికి నివాళులు అర్పించిన ఇండియన్ ఆర్మీ

| Edited By:

Jul 08, 2020 | 6:19 PM

జమ్ముకశ్మీర్‌లో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇండియన్ ఆర్మీకి చెందిన జవాన్ వీరమరణం పొందారు. సౌత్‌ కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిలో నాయక్ రాజ్వీందర్ సింగ్ ముష్కరులతో యుద్ధం చేస్తూ..

అమరుడికి నివాళులు అర్పించిన ఇండియన్ ఆర్మీ
Follow us on

జమ్ముకశ్మీర్‌లో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇండియన్ ఆర్మీకి చెందిన జవాన్ వీరమరణం పొందారు. సౌత్‌ కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిలో నాయక్ రాజ్వీందర్ సింగ్ ముష్కరులతో యుద్ధం చేస్తూ.. భారత మాత ఒడిలో ఒరిగిపోయాడు. ఈ క్రమంలో ఆయన భౌతిక కాయానికి బుధవారం నాడు ఇండియన్ ఆర్మీ నివాళులు అర్పించింది. ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో.. జమ్ముకశ్మీర్ పోలీసులు, భద్రతా బలగాలు సౌత్‌ కశ్మీర్‌లో కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో వీరిని గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురు కాల్పులు చేపట్టాయి. అయితే ఈ ఘటనలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో భారత జవాన్ అమరుడయ్యాడు.

కాగా, గత కొద్ది రోజులుగా లోయలో రోజు ఎక్కడో ఓ చోట ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు చోటుచేసుకుంటున్నాయి.