జమ్ముకశ్మీర్లోని నియంత్రణ రేఖ వద్ద.. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రాజౌరీ జిల్లాలోని నౌషేరా సెక్టార్ సమీపంలో సరిహద్దు దాటేందుకు ఇద్దరు పాక్ చొరబాటుదారులు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన సైన్యం.. వారిపై కాల్పులు జరపడంతో ఇద్దరు హతమయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని ఇండియన్ ఆర్మీ తెలిపింది. మరోవైపు గత కొద్ది రోజులుగా నిత్యం సరిహద్దు వెంట పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ కాల్పులకు దిగుతోంది. ఈ క్రమంలోనే చొరబాటుదారులు దేశంలొకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు.
Infiltration attempt foiled by Army along the Line of Control in Nowshera sector of Rajouri. Two infiltrators killed, one injured: Indian Army sources. #JammuAndKashmir
— ANI (@ANI) July 29, 2020