ఐఎండీ హెచ్చ‌రికః ఆ మూడు రాష్ట్రాల‌కు రెడ్ అల‌ర్ట్‌

|

Jun 15, 2020 | 12:27 PM

దక్షిణ మహారాష్ట్రకు చేరుకున్న నైరుతి రుతుపవనాలు.. ముంబై స‌హా, మహారాష్ట్రలోని మిగిలిన ప్రాంతాలను క‌మ్మేశాయ‌ని భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్ర‌క‌టించింది. దీని ప్ర‌భావంతో, మహారాష్ట్ర పశ్చిమ తీరం అటు, దక్షిణాది రాష్ట్రాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది.

ఐఎండీ హెచ్చ‌రికః ఆ మూడు రాష్ట్రాల‌కు రెడ్ అల‌ర్ట్‌
Weather Forecast
Follow us on

దక్షిణ మహారాష్ట్రకు చేరుకున్న నైరుతి రుతుపవనాలు.. ముంబై స‌హా, మహారాష్ట్రలోని మిగిలిన ప్రాంతాలను క‌మ్మేశాయ‌ని భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్ర‌క‌టించింది. దీని ప్ర‌భావంతో, మహారాష్ట్ర పశ్చిమ తీరం అటు, దక్షిణాది రాష్ట్రాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. రాబోయే 24 గంటలలో గోవా మరియు కొంకణ్ ప్రాంతాలలో ప్రదేశాలలో భారీ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది.

ఈ నేపథ్యంలో తెలంగాణ, కర్ణాటక, గోవాలో భారీ నుంచి అతి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతారణ శాఖ తెలిపింది. ఈ మూడు రాష్ట్రాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఏపీ, మేఘాలయ, చత్తీస్‌గఢ్, ఒడిశాలో మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటు రుతుపవనాల ప్రభావంతో తమిళనాడులోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెన్నై వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

కోయంబత్తూరు, నీలగిరి, దిండుగల్ జిల్లాల్లోని ఒకటి రెండు ప్రాంతాల్లో మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ధర్మపురి, కృష్ణగిరి, తేలం, తిరువణామలై జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు కురిసే అవకాశముంది. అరేబియా పశ్చిమ సముద్ర ప్రాంతాలు, మధ్య తూర్పు అరేబియా సముద్రం, కర్ణాటక, దక్షిణ మహారాష్ట్ర, గోవా సముద్ర ప్రాంతాల్లో గంటకు 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్న అధికారులు.. ఈ ప్రాంతాల్లో మత్స్యకారులు రెండు రోజులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.