పాక్‌ కాల్పుల్లో ధ్వంసమైన సరిహద్దు గ్రామల ఇళ్లు

| Edited By:

Aug 22, 2020 | 12:21 AM

పాక్‌ జరుపుతున్న కాల్పులతో సరిహద్దు గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కథువా జిల్లాలోని హీరా నగర్‌ సెక్టార్‌ సరిహద్దు గ్రామాలపై పాక్‌ కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో సరిహద్దు..

పాక్‌ కాల్పుల్లో ధ్వంసమైన సరిహద్దు గ్రామల ఇళ్లు
Follow us on

పాక్‌ జరుపుతున్న కాల్పులతో సరిహద్దు గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కథువా జిల్లాలోని హీరా నగర్‌ సెక్టార్‌ సరిహద్దు గ్రామాలపై పాక్‌ కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో సరిహద్దు గ్రామాల్లోని పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..నిత్యం పాక్ కాల్పులకు దిగుతోందని.. దీంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. రాత్రి 10.00 గంటల తర్వాత కాల్పులకు దిగుతోందని.. ఉదయం 5.00 గంటల వరకు కొనసాగుతోందని తెలిపారు. తమ ఇళ్లపై పాక్ పేల్చిన తూటాలు పడుతున్నాయని.. కొన్ని చిన్నచిన్న షెల్స్‌ను ప్రయోగిస్తోందన్నారు. అంతేకాదు చిన్నచిన్న రాకెట్ లాంచర్లను కూడా ఉపయోగించడం ద్వారా.. తమ ఇంటి గోడలు ధ్వంసమవుతున్నాయని.. కొన్ని సమయాల్లో ప్రాణాలు కూడా కోల్పోతున్నామని అక్కడి ప్రజలు చెబుతున్నారు.

Read More :

గుండెపోటుతో బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత

కేంద్రమంత్రికి పాజిటివ్‌.. క్వారంటైన్‌లోకి హర్యానా సీఎం