జీఎస్టీ కౌన్సిల్ 40వ సమావేశం..ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చ‌

|

Jun 12, 2020 | 1:28 PM

మరి కాసేపట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్‌ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం జరగనుంది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయా రాష్ట్రాల‌ ఆర్థిక మంత్రులతో సమావేశం కానున్న సీతారామన్‌..రాష్ట్రాలకు

జీఎస్టీ కౌన్సిల్ 40వ సమావేశం..ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చ‌
Follow us on

మరి కాసేపట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్‌ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం జరగనుంది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయా రాష్ట్రాల‌ ఆర్థిక మంత్రులతో సమావేశం కానున్న సీతారామన్‌..రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లింపులపై నూతన మార్గదర్శకాలపై చర్చించనున్నారు. దేశంలో కరోన మహమ్మారి ప్రభావం మొదలైన తరువాత తొలిసారి సమావేశం అవుతున్న జీఎస్టీ కౌన్సిల్ పలు కీలక అంశాలపై చర్చిచనుంది.

క‌రోనా, లాక్‌డౌన్ కార‌ణంగా జీఎస్టీ కౌన్సిల్ 40వ సమావేశం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా..కరోనా వైరస్ ప్రభావం పన్ను ఆదాయాలపై ఎలా ఉందనే అంశంపై చర్చించే అవకాశమున్నట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అలాగే, ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలనే మార్గాలపై కూడా కౌన్సిల్ చర్చించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం లాక్‌డౌన్ తర్వాత నిత్యావసర వస్తువులకు మాత్రమే ఉన్న డిమాండ్, అన్ని రకాల వస్తువులకు డిమాండ్ పెరిగేలా.. అన్ని రంగాల్లో ఆర్థిక కార్యకలాపాలను మెరుగుప‌ర్చాల‌ని కౌన్సిల్ భావిస్తోంది.లాక్‌డౌన్ కారణంగా ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన జీఎస్టీ గణాంకాలను కేంద్రం వెల్లడించలేదు. వసూళ్లు భారీగా పడిపోవడం, రిటర్నుల దాఖలుకు గడువు పొడిగింపుతో కేంద్రం తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంటోంది. జీఎస్టీ కౌన్సిల్ చివరిగా మార్చి 14న జరిగింది.