జమ్మూకశ్మీర్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు భంగం కలిగించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. అరగంట వ్యవధిలోనే రెండు వేర్వేరు చోట్ల ఉగ్రవాదులు గ్రెనేడ్లు విసిరారు. బుద్గాంలోని గోపాలపురా చదూరా ప్రాంతంలో ఉగ్రవాదులు గ్రెనేడ్తో దాడి చేసినట్లు రాత్రి 9:05 గంటలకు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో కరణ్ కుమార్ సింగ్ అనే వ్యక్తి గాయపడ్డాడు. ఆ తర్వాత ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం పోలీసులు ఆ మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టారు.
దీని తర్వాత, కాశ్మీర్ జోన్ పోలీసులు రాత్రి 9.35 గంటలకు ట్వీట్ చేస్తూ, శ్రీనగర్లోని పోలీసు కంట్రోల్ రూమ్పై ఉగ్రవాదులు గ్రెనేడ్ విసిరారని సమచారం అందించారు. ఈ దాడిలో ఓ పోలీసు సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి.
J&K | Terrorists hurled grenade in Gopalpora Chadoora area of Budgam in which one civilian namely Karan Kumar Singh got injured; his condition is stated to be stable. Area cordoned off. Further details awaited: Police
(Visuals deferred by unspecified time) pic.twitter.com/bJ3x6ok1Iy
— ANI (@ANI) August 15, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..