కుప్వారాలో మంచు తుఫాన్ విధ్వంసం.. నలుగురు జవాన్లు మృతి

| Edited By:

Jan 14, 2020 | 2:03 PM

జమ్ముకశ్మీర్‌లో మంచుతుఫాన్ బీభత్సాన్ని సృష్టిస్తోంది. ఈ మంచు తుఫాన్ ఎఫెక్ట్‌కు నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. మరో జవాన్ గల్లంతయ్యాడు. ఈ ఘటన కుప్వారా జిల్లాలోని మాచిల్ సెక్టార్‌లో చోటుచేసుకుంది. సోమవారం మధ్యాహ్నం మంచు తుఫాన్.. ఒక్కసారిగా మాచిల్ సెక్టార్‌పై విరుకుపడింది. దీంతో ఎనిమిది మంది జవాన్లు కొట్టుకుపోయారు. వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ టీం.. నలుగురు జావాన్లను రక్షించింది. మిగతా జవాన్లు తుఫాన్ ధాటికి గల్లంతయ్యారు. అయితే ఈ నలుగురు జవాన్లు చనిపోయినట్లు ఆర్మీ అధికారులు […]

కుప్వారాలో మంచు తుఫాన్ విధ్వంసం.. నలుగురు జవాన్లు మృతి
Follow us on

జమ్ముకశ్మీర్‌లో మంచుతుఫాన్ బీభత్సాన్ని సృష్టిస్తోంది. ఈ మంచు తుఫాన్ ఎఫెక్ట్‌కు నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. మరో జవాన్ గల్లంతయ్యాడు. ఈ ఘటన కుప్వారా జిల్లాలోని మాచిల్ సెక్టార్‌లో చోటుచేసుకుంది. సోమవారం మధ్యాహ్నం మంచు తుఫాన్.. ఒక్కసారిగా మాచిల్ సెక్టార్‌పై విరుకుపడింది. దీంతో ఎనిమిది మంది జవాన్లు కొట్టుకుపోయారు. వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ టీం.. నలుగురు జావాన్లను రక్షించింది. మిగతా జవాన్లు తుఫాన్ ధాటికి గల్లంతయ్యారు. అయితే ఈ నలుగురు జవాన్లు చనిపోయినట్లు ఆర్మీ అధికారులు ధృవీకరించారు. ఇక మరో జవాన్ కూడా గల్లంతయ్యాడని.. రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపడుతోందని తెలిపారు. అటు బార్డర్‌లో (ఎల్‌ఓసీ) వెంబడి కూడా ఇదే పరిస్థితి నెలకొంది. గత 48 గంటలుగా మంచు తుఫాన్ ఈ ప్రాంతంలో విరుచుకుపడుతుందని.. పలువురు సామాన్యులు కూడా మరణించినట్లు తెలుస్తోంది.