Chennai: సున్నం వేసిన ఇంటికే కన్నం వేశారు.. పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు

|

Apr 29, 2022 | 6:27 PM

ఆ ఇంట్లో శుభకార్యం నిర్వహిస్తుండటంతో ఇంటికి సున్నం వేసేందుకు కొందరు వ్యక్తులు వచ్చారు. వారు పనులు చేస్తున్న సమయంలో ప్రత్యేక గది కనిపించింది. ఓపెన్ చూసి చూడగా..వారిలోని దుర్బుద్ధి బయటపడింది. ఆ రూమ్ లో...

Chennai: సున్నం వేసిన ఇంటికే కన్నం వేశారు.. పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు
Arrest
Follow us on

ఆ ఇంట్లో శుభకార్యం నిర్వహిస్తుండటంతో ఇంటికి సున్నం వేసేందుకు కొందరు వ్యక్తులు వచ్చారు. వారు పనులు చేస్తున్న సమయంలో ప్రత్యేక గది కనిపించింది. ఓపెన్ చూసి చూడగా..వారిలోని దుర్బుద్ధి బయటపడింది. ఆ రూమ్ లో ఉన్న డబ్బు, నగలను తీసుకుని మెల్లగా అక్కడి నుంచి జారుకున్నారు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. తమిళనాడులోని తిరుప్పూర్‌కు చెందిన దురైస్వామికి బనియన్‌ ఉత్పత్తి పరిశ్రమలు, కాటన్ మిల్లులు ఉన్నాయి. ఆయన తన కుమార్తెకు ఇటీవలే వివాహం జరిపించారు. కూతురికి పెళ్లి చేయడంతో భార్యతో కలిసి ఇంట్లో ఉంటున్నాడు. వీరితో పాటు కొందరు పని వాళ్లూ అదే ఇంట్లో ఉన్నారు. కుమార్తెకు పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేస్తుండగా.. కొందరు వ్యక్తులు చేతివాటం ప్రదర్శించారు. సున్నం వేసే సమయంలో ఇంట్లో నుంచి నగలు, డబ్బుతో ఉడాయించారు. పెళ్లి అయిపోయాక ఇంటి యజామానులు ఈ ఘటనను గుర్తించారు. ఈ ఘటనపై చెన్నై పోలీసులను ఆశ్రయించాడు. అక్కడి నుంచి తిరుప్పూరుకు కేసు బదిలీ అయ్యింది. వీరిలో తిరువణ్ణామలైకు చెందిన సతీష్, దామోదరన్, శక్తి, నీలగిరికి చెందిన రాధాకృష్ణన్‌పై అనుమానాలు నెలకొన్నాయి. వీరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

సున్నం కొట్టే సమయంలో దురై స్వామి ఇంట్లో తమకు ఒక రహస్య గది కనిపించిందని, అందులోకి వెళ్లి చూడగా, కొన్ని చిన్న చిన్న సంచుల్లో రూ. 2 వేల నోట్లను మూటలు కట్టి పడేసి ఉన్నాయని, అందులో ఓ సంచితో తాము పరారైనట్లు అంగీకరించారు. దీంతో ఈ నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరు దోచుకెళ్లిన నగదు విలువ రూ. 2.5 కోట్లు ఉంటుందని నిర్ధారించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇదీచదవండి

Maharashtra: వరుడు సమయానికి రాలేదని.. వధువుకు మరో వ్యక్తితో పెళ్లి చేశారు.. మైండ్ బ్లోయింగ్ ఇన్సిడెంట్