Chetan Chauhan on ventilator: ఉత్తరప్రదేశ్ మంత్రి, టీమిండియా మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ ఆరోగ్యం క్షీణించింది. ప్రస్తుతం వెంటిలేటర్పై ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా గత నెలలో చేతన్కి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయనను లక్నోలోని సంజయ్ గాంధీ ఆసుపత్రికి తరలించగా, అక్కడే చికిత్స పొందుతున్నారు. చికిత్స సమయంలోనే ఆయనకు బీపీతో పాటు కిడ్నీ సంబంధ సమస్యలు తలెత్తాయి. దీంతో శుక్రవారం రాత్రి నుంచి వైద్యులు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. కాగా టీమిండియా తరఫున పలు టెస్ట్లు, వన్డేల్లో క్రికెట్ ఆడిన చేతన్ చౌహాన్.. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ కేబినెట్లో మంత్రిగా పనిచేస్తున్న విషయం తెలిసిందే.
Read More:
‘కార్గిల్ గర్ల్’ మేకర్లు క్షమాపణలు చెప్పాల్సిందే
సుశాంత్ కుటుంబానికి న్యాయం జరగాలి: నిర్భయ తల్లి