దేశ రాజధానిలో మరో భారీ అగ్నిప్రమాదం

| Edited By:

Jul 16, 2020 | 4:30 AM

దేశ రాజధాని ఢిల్లీలో గురువారం రాత్రి మరోసారి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రోహినీ ప్రాంతంలోని షహబాద్‌ డెయిరీ ఎరియాలో అకస్మాత్తుగా అగ్నిప్రమదం చోటుచేసుకుంది. దీంతొ వెంటనే అక్కడి స్థానికులు..

దేశ రాజధానిలో మరో భారీ అగ్నిప్రమాదం
Follow us on

దేశ రాజధాని ఢిల్లీలో గురువారం రాత్రి మరోసారి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రోహినీ ప్రాంతంలోని షహబాద్‌ డెయిరీ ఎరియాలో అకస్మాత్తుగా అగ్నిప్రమదం చోటుచేసుకుంది. దీంతొ వెంటనే అక్కడి స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన ఫైర్‌ సిబ్బంది ఫైర్‌ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు. తొలుత 10 ఫైర్‌ ఇంజన్ల సహాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా.. మంటలు అదుపులోకి రాకపోవడంతో మరో 10 ఫైర్ ఇంజన్లను కూడా రంగంలోకి దింపి మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని ఢిల్లీ డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ ధర్మపాల్ భరద్వాజ్ తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని.. ఆస్తి నష్టంపై కూడా ఎలాంటి సమాచారం తెలియలేదన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.