ఏటీఎంలో చెలరేగిన మంటలు.. 10 లక్షలు బుగ్గి..

| Edited By:

Jul 06, 2020 | 8:13 PM

గుజరాత్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సీటీఎం ప్రాంతంలోని ఓ బ్యాంకు ఏటీఎంలో మంటలు చెలరేగాయి. దీంతో పది లక్షల రూపాయలు మంటల్లో కాలిపోయాయి. ఈ సంఘటన సోమవారం నాడు..

ఏటీఎంలో చెలరేగిన మంటలు.. 10 లక్షలు బుగ్గి..
Follow us on

గుజరాత్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సీటీఎం ప్రాంతంలోని ఓ బ్యాంకు ఏటీఎంలో మంటలు చెలరేగాయి. దీంతో పది లక్షల రూపాయలు మంటల్లో కాలిపోయాయి. ఈ సంఘటన సోమవారం నాడు చోటుచేసుకుంది. అగ్నిప్రమాదం జరిగిన సమాచారాన్ని అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పారు. ఏటీఎం నుంచి మంటలు బ్యాంకులోకి వెళ్లకుండా ఫైర్ సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ ఘటనలో ఏటీఎంలో ఉన్న క్యాష్‌తో పాటు.. పాస్ బుక్ ప్రింటింగ్ మిషన్‌ పూర్తిగా కాలిపోయాయని బ్యాంక్ అధికారులు తెలిపారు. అయితే ఘటనకు గల కారణాలు ఇంకా తెలియ రాలేదు. ఈ అగ్నిప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.