ఆస్పత్రి మెడికల్‌ షాపులో అగ్నిప్రమాదం.. కరోనా రోగుల తరలింపు

| Edited By:

Aug 12, 2020 | 9:54 AM

మహారాష్ట్రలో కరోనా పేషెంట్స్‌ ఉన్న ఓ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. థానే మున్సిపల్‌ కార్పోరేషన్‌ పరిధిలో ఉన్న దియా మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలోని మెడికల్ షాపులో అగ్నిప్రమాదం..

ఆస్పత్రి మెడికల్‌ షాపులో అగ్నిప్రమాదం.. కరోనా రోగుల తరలింపు
Follow us on

మహారాష్ట్రలో కరోనా పేషెంట్స్‌ ఉన్న ఓ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. థానే మున్సిపల్‌ కార్పోరేషన్‌ పరిధిలో ఉన్న దియా మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలోని మెడికల్ షాపులో అగ్నిప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి 11.00 గంటలకు ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో ఆస్పత్రిలోని ఐసీయూలో నలుగురు కరోనా పేషెంట్స్‌ ఉన్నారు. మెడికల్ షాపులో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో.. వెంటనే వారిని ఆస్పత్రి నుంచి అంబులెన్స్‌లో ఇతర ఆస్పత్రులకు తరలించారు.ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదని అధికారులు తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే.. అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పేశారు.