టిక్‌టాక్‌ స్టార్‌పై కేసు నమోదు… హర్యానాలో కొనసాగుతున్న ఆందోళనలు

|

Jun 06, 2020 | 6:50 PM

టిక్‌టాక్‌ స్టార్‌ బీజేపీ నేత సోనాలి పోగట్‌ మీద కేసు నమోదయ్యింది. హర్యానా ధాన్యం మార్కెట్‌లో అధికారి సుల్తాన్‌సింగ్‌ను కొట్టడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సుల్తాన్‌ సింగ్‌ ఫిర్యాదు మేరకు పోగాట్‌పై కేసు నమోదు చేసినట్లుగా హిస్సార్‌ ఎస్పీ గంగారామ్‌ పునియా తెలిపారు. ప్రభుత్వ అధికారిని అవమానించిన కేసులో పోగట్‌పై ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌ చేశామన్నారు. సోనాలి ఫొగ‌ట్ కోవిడ్ ప‌రిస్థితుల నేప‌థ్యంలో బాలాస్మంద్‌లోని ధాన్యం మార్కెట్‌ను స‌మీక్షించేందుకు వెళ్లారు. ఈ క్ర‌మంలో అక్క‌డున్న మార్కెట్ సెక్ర‌ట‌రీతో […]

టిక్‌టాక్‌ స్టార్‌పై కేసు నమోదు... హర్యానాలో కొనసాగుతున్న ఆందోళనలు
Follow us on

టిక్‌టాక్‌ స్టార్‌ బీజేపీ నేత సోనాలి పోగట్‌ మీద కేసు నమోదయ్యింది. హర్యానా ధాన్యం మార్కెట్‌లో అధికారి సుల్తాన్‌సింగ్‌ను కొట్టడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సుల్తాన్‌ సింగ్‌ ఫిర్యాదు మేరకు పోగాట్‌పై కేసు నమోదు చేసినట్లుగా హిస్సార్‌ ఎస్పీ గంగారామ్‌ పునియా తెలిపారు. ప్రభుత్వ అధికారిని అవమానించిన కేసులో పోగట్‌పై ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌ చేశామన్నారు.

సోనాలి ఫొగ‌ట్ కోవిడ్ ప‌రిస్థితుల నేప‌థ్యంలో బాలాస్మంద్‌లోని ధాన్యం మార్కెట్‌ను స‌మీక్షించేందుకు వెళ్లారు. ఈ క్ర‌మంలో అక్క‌డున్న మార్కెట్ సెక్ర‌ట‌రీతో ఆమెతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆగ్ర‌హంతో ఊగిపోయిన సోనాలి అత‌నికి చెంప‌దెబ్బ రుచి చూపించారు. దీనికి సంబంధించిన‌ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై సొనాలి మాట్లాడుతూ అత‌ను దుర్భాష‌లాడుతూ, త‌న‌ను అవ‌మానించ‌డం వ‌ల్లే కొట్టాల్సి వ‌చ్చింద‌ని అన్నారు. మార్కెట్ సెక్ర‌ట‌రీ మాత్రం తానేమీ అన‌క‌ముందే సోనాలి త‌న‌పై దాడి చేసింద‌ని చెప్పుకొచ్చారు. కాగా టిక్‌టాక్‌తో గుర్తింపు సంపాదించుకున్న సోనాలి ఫొగ‌ట్‌కు బీజేపీ గ‌తేడాది ఎన్నిక‌ల్లో హ‌ర్యానాలోని ఆదంపూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.