జమ్ముకశ్మీర్లో శనివారం తెల్లా వారుజామునుంచే ఉగ్రవేట కొనసాగుతోంది. కుల్గాం ప్రాతంలో పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా కూంబింగ్ చేపడుతుండగా.. ఉగ్రవాదులు వీరిపై కాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు.. ఉగ్రవాదులపై ఎదురుకాల్పులు చేపట్టాయి. కుల్గాం ప్రాంతంలోని సిగ్నాపూర్ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. అయితే ఇంకా ఈ ఎన్కౌంటర్ కొనసాగుతుందని.. కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. ఎంత మంది ఉగ్రవాదులు హతమయ్యారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
An encounter has started at Sighanpor area of Kulgam. Police and security forces are on the job. Further details shall follow: Kashmir Zone Police#JammuAndKashmir
— ANI (@ANI) August 8, 2020
Read More :