ఓ వైపు కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటిని వణికిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఇదే సమయంలో ప్రకృతి కూడా ప్రజలపై కన్నెర్ర చేస్తోంది. గత కొద్ది రోజులుగా.. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిస్తే.. మరికొన్ని చోట్ల భూకంపాలు సంభవిస్తున్నాయి. తాజగా మన దేశంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు ఓ వైపు కురుస్తుంటే.. మరోవైపు భూకంపాలు ప్రజల్ని వణికిస్తున్నాయి. బుధవారం మధ్యాహ్నం అసోంలోని తేజ్పూర్ ప్రాంతలో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టార్ స్కేల్పై 2.7 మాగ్నిట్యూడ్గా నమోదైంది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. కాగా, బుధవారం తెల్లవారు జామున కశ్మీర్లో కూడా భూ ప్రకంపనలు వచ్చాయి.
Earthquake of magnitude 2.7 on the Richter Scale occurred 49 km Southeast of Tezpur, Assam, today at 14:26 IST: National Centre for Seismology pic.twitter.com/gb3mNfCOQR
— ANI (@ANI) July 8, 2020