దేశరాజధానిలో భారీ వర్షం.. గోడ కూలి కార్లు ధ్వంసం

| Edited By:

Aug 19, 2020 | 3:00 PM

దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి. సాకేత్‌ ప్రాంతంలోని జే బ్లాక్‌లో ఓ గోడ కుప్పకూలింది. ఈ ఘటనలో గోడ వెంట పార్కింగ్ చేసి ఉన్న వాహానాలు..

దేశరాజధానిలో భారీ వర్షం.. గోడ కూలి కార్లు ధ్వంసం
Follow us on

దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి. సాకేత్‌ ప్రాంతంలోని జే బ్లాక్‌లో ఓ గోడ కుప్పకూలింది. ఈ ఘటనలో గోడ వెంట పార్కింగ్ చేసి ఉన్న వాహానాలు ధ్వంసంమయ్యాయి. గోడ శిథిలాలన్నీ.. పక్కనే ఉన్న కార్లపై పడ్డాయి. ఇదిలావుంటే.. ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో పలు చోట్ల భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. మరోవైపు ఆగస్టు 25వ తేదీ వరకు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.