కరోనా వ్యాప్తికి బీజేపీ ర్యాలీలు, సమావేశాలే కారణం..!

| Edited By:

Jul 23, 2020 | 3:08 PM

కరోనా మహమ్మారి వ్యాప్తికి బీజేపీ నిర్వహిస్తోన్న ర్యాలీలే కారణమంటూ ఆరోపించారు మధ్యప్రేదశ్‌కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పీసీ శర్మ. గురువారం నాడు నిర్వహించిన ఓ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్‌లో..

కరోనా వ్యాప్తికి బీజేపీ ర్యాలీలు, సమావేశాలే కారణం..!
Follow us on

కరోనా మహమ్మారి వ్యాప్తికి బీజేపీ నిర్వహిస్తోన్న ర్యాలీలే కారణమంటూ ఆరోపించారు మధ్యప్రేదశ్‌కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పీసీ శర్మ. గురువారం నాడు నిర్వహించిన ఓ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విస్తరించడానికి కారణం బీజేపీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే.. మరోవైపు బీజేపీ మాత్రం ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తోందన్నారు. మూడు నెలల పాటు లాక్‌డౌన్ విధించిన తర్వాత అన్‌లాక్ చేశారని.. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు పదిరోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్నారన్నారు. దీనికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమేనన్నారు. ఆస్పత్రుల్లో సరైన సౌకర్యాలు కూడా లేవని.. తొలుత కరోనా కేసులను నియంత్రించకుండా వదిలేశారని.. దాని కారణంగానే ఇప్పుడు సామాజిక వ్యాప్తి అయ్యిందన్నారు.