లాక్డౌన్ నేపథ్యంలో బయటకు రావడానికి వీల్లేకుండా పోయింది. నిత్యావసర సరుకులు, కూరగాయల కోసం మాత్రమే ప్రజలను బయటకు అనుమతినిస్తున్నారు. అందుకోసం కూడా కొన్ని గంటల సమయం మాత్రమే గడువు పెడుతున్నారు. అయితే ఈ లాక్డౌన్ నేపథ్యంలో కండోమ్స్, ప్రెగ్నేన్సీ కిట్ లాంటి.. కొన్ని వస్తువులు బయట దొరకడం లేదు. దీంతో ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ముంబయిలోని ప్రజలు ఎక్కువగా కండోమ్స్, హైదరాబాద్లోని ప్రజలు ఎక్కువగా ఐ-పిల్లను ఆర్డర్ చేశారు. ఈ వివరాలను ప్రముఖ డంజో యాప్ బయటపెట్టింది.
ఈ నెల 14న జాతినుద్దేశించి మాట్లాడిన ప్రధాని లాక్డౌన్ను కొనసాగిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లాక్డౌన్ నేపథ్యంలో వివిధ ప్రదేశాల్లోని ప్రజలు ఏఏ వస్తువులు ఎక్కువగా ఆర్డర్ చేశారో.. వాటికి సంబంధించి వివరాలను డంజో యాప్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వివరాల ప్రకారం.. బెంగళూరు, పుణెలో ప్రెగ్నెన్సీ కిట్.. చెన్నై, జైపూర్లో హ్యాండ్ వాష్, ముంబయిలో కండోమ్స్, హైదరాబాద్లోని ప్రజలు ఐ-పిల్ను ఎక్కువగా ఆర్డర్ చేసినట్లు వెల్లడించారు. అందులో చెన్నై, జైపూర్ ప్రజలు ఆరోగ్యం మీద శ్రద్ధ చూపగా.. మిగిలిన వారు సామాజిక దూరాన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా ‘రక్షణ’, ప్రెగ్నెన్సీ కిట్, ఐ పిల్ లాంటి వస్తువులు ఆర్డర్ చేయడం గమనర్హం.
Read This Story Also: సినిమాలో రామ్ చరణ్ తెలుసా..? కేటీఆర్ వీడియో వైరల్..!
Some Indian cities med the most of it during the lockdown, this March. Delivering from pharmacies is clearly no child's play.?#Contraceptives #Condoms #PregancyKits #HandWash #IPill #Pharmacies #Medicines #Lockdown2020 #quarantinelife #quarantineandchill pic.twitter.com/6fEvKMJniC
— Dunzo (@DunzoIt) April 14, 2020