మావోల ఘాతుకం.. కానిస్టేబుల్‌ను కొట్టి చంపి.. అతడి తల్లిదండ్రులపై..

| Edited By:

Jul 02, 2020 | 12:34 PM

ఛత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. బీజాపూర్‌ జిల్లాలో ఓ కానిస్టేబుల్‌ ఇంటిపై దాడి చేసి హతమార్చారు. బుధవారం రాత్రి సదరు కానిస్టేబుల్‌ ఇంటిపై మావోయిస్టులు దాడికి..

మావోల ఘాతుకం.. కానిస్టేబుల్‌ను కొట్టి చంపి.. అతడి తల్లిదండ్రులపై..
Follow us on

ఛత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. బీజాపూర్‌ జిల్లాలో ఓ కానిస్టేబుల్‌ ఇంటిపై దాడి చేసి హతమార్చారు. బుధవారం రాత్రి సదరు కానిస్టేబుల్‌ ఇంటిపై మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు. జాంగ్లా ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఉన్న కానిస్టేబుల్‌ను బయటకు లాగి కొట్టి చంపేశారు. అంతేకాదు.. అతడి తల్లిదండ్రులను కూడా గాయపర్చారు. ఈ విషయాన్ని బీజాపూర్ ఎస్పీ కమలోచన్‌ కష్యప్‌ తెలిపారు.

మరోవైపు దంతెవాడ జిల్లాలో పద్దెనిమిది మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరు అనేక ఘటనల్లో నిందితులుగా ఉన్నారు. కొందరి తలలపై లక్ష రూపాయల రివార్డు కూడా ఉంది. దీంతో పోలీసులు ఆ రివార్డు సోమ్మును వారికి ఇచ్చి.. ఉపాధి కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.