ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో మందుపాత‌ర‌ను పేల్చిన‌ మావోయిస్టులు‌.. చికిత్స పొందుతూ డిప్యూటీ క‌మాండ‌ర్ మృతి

|

Dec 14, 2020 | 12:24 PM

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. సుక్మా జిల్లాలో మావోయిస్టులు పేల్చిన మందుపాత‌ర‌లో కోబ్రా డిప్యూటీ క‌మాండ‌ర్ మ‌ర‌ణించారు. బ‌స్త‌ర్ రీజియ‌న్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టుల కోసం...

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో మందుపాత‌ర‌ను పేల్చిన‌ మావోయిస్టులు‌.. చికిత్స పొందుతూ డిప్యూటీ క‌మాండ‌ర్ మృతి
Follow us on

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. సుక్మా జిల్లాలో మావోయిస్టులు పేల్చిన మందుపాత‌ర‌లో కోబ్రా డిప్యూటీ క‌మాండ‌ర్ మ‌ర‌ణించారు. బ‌స్త‌ర్ రీజియ‌న్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టుల కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌డుతుండ‌గా, మావోయిస్టులు ఈ మందుపాత‌ర‌ను పేల్చారు. దీంతో కోబ్రా బెటాలియ‌న్ డిప్యూటీ క‌మాండ‌ర్ వికాస్ కుమార్ తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. సిబ్బంది వెంట‌నే హెలికాప్ట‌ర్ ద్వారా రాయ్‌పూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రికి త‌రలించ‌గా, అక్క‌డ చికిత్స పొందుతూ సోమ‌వారం మృతి చెందిన‌ట్లు బ‌స్త‌ర్ రేంజ్ ఐజీ సందేరాజ్ వెల్ల‌డించారు.

కాగా, నిన్న కాసారం నాలా ప్రాంతంలో ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు ఆయ‌న తెలిపారు. కోబ్రా క‌మాండోలే ల‌క్ష్యంగా మావోయిస్టులు ఈ ఐఈడీని పేల్చిన‌ట్లు చెప్పారు. మృత‌దేహాన్ని ఈ రోజు మ‌ధ్యాహ్నం ఢిల్లీకి త‌ర‌లిస్తామ‌న్నారు. న‌వంబ‌ర్ 29న కూడా సుక్మా జిల్లాలోని తాల్మెట‌లా ప్రాంతంలో మావోయిస్టులు మందుపాత‌ర‌ను పేల్చారు. ఈ ఘ‌ట‌న‌లో కోబ్రా అసిస్టెంట్ క‌మాండ‌ర్ మ‌ర‌ణించ‌గా, మ‌రో ఎనిమిది మంది గాయ‌పడ్డారు.