Chhattisgarh Encounter: పోలీసులు- మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు.. మావోల క్యాంపులు ధ్వంసం

|

Jan 06, 2021 | 11:59 PM

Chhattisgarh Encounter:  ఛత్తీస్‌గఢ్‌లో ఎదురు కాల్పులు జరిగాయి. బీజాపూర్‌ జిల్లా మిల్లా మిత్వా, లేండ్రాలో మావోయిస్టులకు, పోలీసులకు ఎదురు కాల్పులు చోటు ....

Chhattisgarh Encounter: పోలీసులు- మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు.. మావోల క్యాంపులు ధ్వంసం
Gadchiroli Encounter
Follow us on

Chhattisgarh Encounter:  ఛత్తీస్‌గఢ్‌లో ఎదురు కాల్పులు జరిగాయి. బీజాపూర్‌ జిల్లా మిల్లా మిత్వా, లేండ్రాలో మావోయిస్టులకు, పోలీసులకు ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. మావోయిస్టుల క్యాంపులను పోలీసులు ధ్వంసం చేశారు. ఘటన స్థలంలో ఆయుధాలు, పేలుడు సామాగ్రి, నిత్యావసర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కాగా, మావోయిస్టులకు అడ్డాగా మారిన ఛత్తీస్‌గఢ్‌.. ప్రతి రోజు ఏదో ఒక ప్రాంతంలో బీభత్సం సృష్టిస్తూనే ఉన్నారు. రోడ్డు పనులు, వంతెన నిర్మాణ పనులను అడ్డుకోవడం, వాహనాలను దగ్ధం చేయడం లాంటివి చేస్తూనే ఉన్నారు. ఈ ప్రాంతంలో మావోల కదలికలు అధికంగా ఉండటంతో పోలీసులు ఎప్పటికప్పుడు ప్రత్యేక నిఘా పెడుతున్నారు. వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. మావోల కదలికల సమాచారంతో గాలింపు చర్యలు చేపడుతున్న పోలీసులపై కాల్పులకు దిగారు. అప్రమత్తమైన పోలీసు బలగాలు ఎదురు కాల్పులకు దిగారు. దీంతో మావోలు పారిపోయినట్లు తెలుస్తోంది.

Woman Murder: చిత్తూరు జిల్లాలో దారుణం.. మహిళా రైతు దారుణ హత్య.. ముగ్గురికి తీవ్ర గాయాలు