బడ్జెట్‌కు వేళాయరా..!

| Edited By:

Jul 05, 2019 | 8:47 AM

బడ్జెట్‌కు వేళయ్యింది. మరికాసేపట్లో కేంద్ర బడ్జెట్ పట్టాలెక్కనుంది. దేశం ముందున్న ఎన్నో సవాళ్లు.. మరెన్నో సంక్లిష్టతల నడుమ రూపుదిద్దుకున్న బడ్జెట్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. విత్త మంత్రి ప్రకటించబోయే బడ్జెట్ కోసం దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కేంద్ర కేబినెట్ ఆమోదం తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా ఉదయం పదిన్నరకు పార్లమెంట్ ఆవరణలో కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. కేబినెట్ ఆమోదం అనంతరం 11 గంటలకు బడ్జెట్ ప్రసంగం ప్రారంభం […]

బడ్జెట్‌కు వేళాయరా..!
Follow us on

బడ్జెట్‌కు వేళయ్యింది. మరికాసేపట్లో కేంద్ర బడ్జెట్ పట్టాలెక్కనుంది. దేశం ముందున్న ఎన్నో సవాళ్లు.. మరెన్నో సంక్లిష్టతల నడుమ రూపుదిద్దుకున్న బడ్జెట్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. విత్త మంత్రి ప్రకటించబోయే బడ్జెట్ కోసం దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

కేంద్ర కేబినెట్ ఆమోదం తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా ఉదయం పదిన్నరకు పార్లమెంట్ ఆవరణలో కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. కేబినెట్ ఆమోదం అనంతరం 11 గంటలకు బడ్జెట్ ప్రసంగం ప్రారంభం కానుంది. బడ్జెట్ నేపథ్యంలో నిర్మాలా సీతారమన్ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ను మర్యాదపూర్వకంగా కలువనున్నారు.

ఆర్థిక వ్యవస్థ అవసరాలు, ద్రవ్య పరిమితుల మధ్య కఠిన పరిస్థితుల్లో తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు నిర్మలా సీతారమన్. కొన్ని వర్గాల వారికి వ్యక్తిగత ఆదయా పన్ను ఉపశమనాల్ని కల్పించడంతో పాటు వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, సామాజిక రంగాల్లో వ్యయాల్ని పెంపొందించే అవకాశం ఉంది. వృద్ధి రేటుకు ఊపు నిచ్చేలా రహదారులు, రైల్వే మార్గాలు వంటి మౌలిక రంగంలో వ్యయాలకు పెద్ద ఎత్తున అండదండలు కల్పించనున్నట్లు తెలుస్తోంది.