జైట్లీ అంత్యక్రియల్లో దొంగల చేతివాటం.. బీజేపీ ఎంపీ ఫోన్ చోరీ!

|

Aug 27, 2019 | 9:15 AM

ప్లేస్ ఏదైనా దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తూ.. చాలా తెలివిగా దొంగతనాలు చేస్తున్నారు. ఇటీవల ఢిల్లీలోని నిగమ్ బోధ ఘాట్‌లో మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ అంత్యక్రియలు ఆదివారం ముగియగా.. ఆ సమయంలో దొంగలు రెచ్చిపోయారు. అంత్యక్రియలకు హాజరైన కొంతమంది సెల్‌ఫోన్లను కాజేశారు. ఇక దీనిపై పతంజలి ప్రతినిధి ఎస్.కే. తజరవాలా ట్వీట్ చేస్తూ.. ‘నాతో పాటు 11 మంది ప్రముఖుల ఫోన్లు దొంగలు చోరీ చేసినట్లు’ పేర్కొన్నారు. ఇక ఈ ట్వీట్‌కు బీజేపీ ఎంపీ బాబుల్ […]

జైట్లీ అంత్యక్రియల్లో దొంగల చేతివాటం.. బీజేపీ ఎంపీ ఫోన్ చోరీ!
Follow us on

ప్లేస్ ఏదైనా దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తూ.. చాలా తెలివిగా దొంగతనాలు చేస్తున్నారు. ఇటీవల ఢిల్లీలోని నిగమ్ బోధ ఘాట్‌లో మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ అంత్యక్రియలు ఆదివారం ముగియగా.. ఆ సమయంలో దొంగలు రెచ్చిపోయారు. అంత్యక్రియలకు హాజరైన కొంతమంది సెల్‌ఫోన్లను కాజేశారు. ఇక దీనిపై పతంజలి ప్రతినిధి ఎస్.కే. తజరవాలా ట్వీట్ చేస్తూ.. ‘నాతో పాటు 11 మంది ప్రముఖుల ఫోన్లు దొంగలు చోరీ చేసినట్లు’ పేర్కొన్నారు.

ఇక ఈ ట్వీట్‌కు బీజేపీ ఎంపీ బాబుల్ సుప్రియా స్పందిస్తూ.. దాదాపు 35 మంది ఫోన్లను దొంగలించినట్లు చెప్పారు. ఆ రోజు మొత్తం ఏయే ప్లేస్ లలో ఉందో గూగుల్ మ్యాప్  ట్రాకింగ్ ద్వారా గుర్తించినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేశారు. కాగా, దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.