సరిహద్దుల్లో టెన్షన్ టెన్షన్.. కవ్వింపు చర్యలకు దిగిన పాక్

| Edited By:

Jul 30, 2019 | 8:53 PM

పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మరోసారి చూపుతోంది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. జమ్మూకశ్మీర్‌లోని సుందర్బానీ సెక్టార్‌లో మోటార్ షెల్స్‌తో కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 34 ఏళ్ల భారత జవాను నాయక్‌ క్రిషన్‌లాల్‌ ప్రాణాలు కోల్పోయాడు. తంగ్‌ధర్‌ – కేరాన్‌ సెక్టార్‌లో కూడా కాల్పులకు తెగబడింది. దీంతో అప్రమత్తమైన భారత ఆర్మీ పాకిస్థాన్‌కు గట్టి సమాధానం ఇస్తోంది. భారత సైన్యం జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు పాక్ రేంజర్లు హతమయ్యారు.

సరిహద్దుల్లో టెన్షన్ టెన్షన్.. కవ్వింపు చర్యలకు దిగిన పాక్
Follow us on

పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మరోసారి చూపుతోంది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. జమ్మూకశ్మీర్‌లోని సుందర్బానీ సెక్టార్‌లో మోటార్ షెల్స్‌తో కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 34 ఏళ్ల భారత జవాను నాయక్‌ క్రిషన్‌లాల్‌ ప్రాణాలు కోల్పోయాడు. తంగ్‌ధర్‌ – కేరాన్‌ సెక్టార్‌లో కూడా కాల్పులకు తెగబడింది. దీంతో అప్రమత్తమైన భారత ఆర్మీ పాకిస్థాన్‌కు గట్టి సమాధానం ఇస్తోంది. భారత సైన్యం జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు పాక్ రేంజర్లు హతమయ్యారు.