కశ్మీర్ లోయలో జమ్ముకశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు, రాష్ట్రీయ రైఫిల్స్ సిబ్బంది సంయుక్తంగా కూంబింగ్ చేపడుతున్నారు. గత కొద్ది రోజులుగా కశ్మీర్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సర్చ్ ఆపరేషన్లు చేపడుతున్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున ఉగ్రవాదుల స్థావరాలతో పాటు.. ఆయుధాల డంప్లను స్వాధీనం చేసుకుంటున్నారు. తాజాగా.. మంగళవారం నాడు భద్రతా బలగాలు సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో బారాముల్లా జిల్లా ఉరి సెక్టార్లోని మైదాన్ నాలలో ఆయుధాల డంప్ను గుర్తించారు. మంగళవారం మధ్యాహ్నం పెద్ద ఎత్తున కూంబింగ్ చేపడుతుండగా.. మూడు ఏకే-56 రైఫిల్స్, రెండు పిస్టల్స్, మ్యాగజైన్లతో పాటు.. ఇతర ఆయుధాలను, మందు గుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఇండియన్ ఆర్మీ అధికారికంగా ధృవీకరించింది.
A search operation was launched close to Line of Control at Maidan Nala in Uri Sector of Baramulla, today afternoon. Cache of arms comprising of 3 AK 56, 2 Pistols with magazines and ammunition was recovered: Indian Army pic.twitter.com/S6K9fKeYX6
— ANI (@ANI) July 7, 2020