ఆంటీ తెగువకు ఫిదా అయ్యా: ఆనంద్ మహీంద్రా ట్విట్..

|

Mar 06, 2020 | 11:03 AM

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా మరోసారి వార్తల్లొకెక్కారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ తన స్టైల్‌లో అందరినీ ఆలోచింపజేసే విధంగా వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన మరో కొత్త వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు.

ఆంటీ తెగువకు ఫిదా అయ్యా: ఆనంద్ మహీంద్రా ట్విట్..
Follow us on

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా మరోసారి వార్తల్లొకెక్కారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ తన స్టైల్‌లో అందరినీ ఆలోచింపజేసే విధంగా వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన మరో కొత్త వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. అంతేకాదు..ఆ వీడియోలో ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ..కనిపించిన మహిళా టీచర్‌ని అభినందించారు. వివరాల్లోకి వెళితే…

పుణెలో రోడ్డు పక్కన ఉన్న ఫుట్ పాత్ పై బైక్ నడుపుకుంటూ ఓ వ్యక్తి వెళ్తున్నాడు. అయితే ఇది గమనించిన గోఖలే అనే ఉపాధ్యాయురాలు అతడిని అడ్డుకున్నది. ఇలా ఫుట్ పాత్ పై కాదు రోడ్లపై బైక్ నడపాలని అతడికి ఆమె సూచిందింది. ఆ సమయంలో అక్కడే ఉన్న పలువురు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అది కాస్తా వైరల్ అయ్యింది. అలా వైరల్ అవుతూ ఆనంద్ మహీంద్రా కంట పడింది. ఇది గమనించిన ఆయన ఆ వీడియోను షేర్ చేస్తూ ఆమెను అభినందిస్తూ కామెంట్ చేశారు. వీడియోను చూడగానే ఆమె తెగువకు ప్రశంసలు కురిపిస్తూ ఇలాంటివారి వల్లే ప్రపంచం సురక్షితంగా ఉందని పేర్కొంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆ ఉపాధ్యాయురాలిని సత్కరించాలని, లేదా అంతర్జాతీయ ఆంటీల దినోత్సవాన్ని ఏర్పాటు చేయాలని మహింద్రా కామెంట్ లో పేర్కొన్నారు. అదేవిధంగా ఈ వీడియోను చూడగానే నేను ఆంటీలకు అభిమానిని అయ్యానని పేర్కొన్నారు. దీంతో ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ తాజగా మరోమారు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.