Air India: విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. నోరూరించే రుచులతో కొత్త మెనూ

|

Oct 04, 2022 | 12:58 PM

విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఇకపై విమానాల్లో ట్రావెల్ చేసే వారి కోసం సరికొత్త వంటకాలతో నూతన మొనూను అందుబాటులోకి తీసుకువచ్చింది. నోరూరించే రుచులతో..

Air India: విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. నోరూరించే రుచులతో కొత్త మెనూ
Air India
Follow us on

విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఇకపై విమానాల్లో ట్రావెల్ చేసే వారి కోసం సరికొత్త వంటకాలతో నూతన మొనూను అందుబాటులోకి తీసుకువచ్చింది. నోరూరించే రుచులతో కొత్త వంటకాలతో ప్రయాణీకులకు అలరించేందుకు సిద్ధమైంది. ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఎయిర్‌ ఇండియా యాజమాన్యం ఈ సరికొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. అయితే..ఎయిరిండియాను ఇటీవల టాటా గ్రూప్ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొత్త యాజమాన్యం ఎయిరిండియాకు కొత్త రూపు తెచ్చేలా మార్పులకు తెర లేపింది. తమ దేశీయ విమాన సర్వీసుల్లోనూ కొత్త మెనూ తీసుకువచ్చింది. పండుగ సీజన్ లో నోరూరించే రుచులతో ప్రయాణికులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అక్టోబరు 1 నుంచి ఈ మెనూ అమలు చేస్తున్నారు. ఇంతకీ ఎయిర్‌ ఇండియా అందించే ఈ మెనూలో ఏమున్నాయో తెలిసే మీకు నోరూరిపోవడం పక్కా.

ఇందులో చికెన్ 65, బ్లూబెర్రీ వెనిల్లా పేస్ట్రీలు, గ్రిల్డ్ స్లైస్డ్ పెస్టో చికెన్ శాండ్విచ్ లు మెనూలో ఉన్నాయి. బిజినెస్ క్లాస్ మెనూ విషయంలో ఆలూ పరాటా, చికెన్ చెట్టినాడ్, షుగర్ ఫ్రీ డార్క్ చాకోలేట్ ఓట్ మీల్ మఫ్ఫిన్, ఫిష్‌ కర్రీ, మేదు వడ, మస్టర్డ్ క్రీమ్ చికెన్ సాసేజ్, ముంబయి బటాటా వడ, బంగాళాదుంప ఇగురు, ఇడ్లీ తదితర వంటకాలను అందిస్తున్నారు. ఎకానమీ క్లాస్ లో ప్రయాణించే వారి కోసం చీజ్ మష్రూమ్ ఆమ్లెట్, డ్రై జీరా ఆలూ వెడ్జెస్, వెజ్ బిర్యానీ, మలబార్ చికెన్ కర్రీ, మిక్స్ డ్ వెజిటబుల్ కర్రీ, వెల్లుల్లి కలిపిన బచ్చలికూర-మొక్కజొన్న, వెజిటబుల్ ఫ్రైడ్ నూడిల్స్, చిల్లీ చికెన్ తదితర ఐటమ్ లు అందిస్తున్నారు.

ప్రయాణికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ మెనూ రూపొందించినట్టు ఎయిరిండియా ప్రయాణికుల సేవా విభాగం అధిపతి సందీప్ వర్మ తెలిపారు. ఈ నిర్ణయంతో ఎయిర్ ఇండియాలో ప్రయాణాలు పెరుగుతాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్  చేయండి..