Viral: పొలంలో పొదల మాటున టూరిస్ట్ బస్సు.. దాని కింద అనుమానాస్పద పార్శిల్స్.. పోలీసులు విప్పి చూడగా…

|

Jul 07, 2022 | 9:27 AM

అక్రమార్కులు... అస్సలు తగ్గడం లేదు. పుష్పను మించిన స్కెచ్చులతో రెచ్చిపోతున్నారు. పోలీసులకు చిక్కకుండా తమ మార్క్ క్రియేటివిటీని వాడుతున్నారు.

Viral: పొలంలో పొదల మాటున టూరిస్ట్ బస్సు.. దాని కింద అనుమానాస్పద పార్శిల్స్.. పోలీసులు విప్పి చూడగా...
Crime News
Follow us on

అక్రమార్జనకు అలవాటు పడ్డ గంజాయి స్మగ్లర్లు, యువత జీవితాల్ని బలి చేస్తున్న ఈ మాయదారి మత్తును రాష్ట్రాల సరిహద్దులు దాటించేందుకు పుష్పకు మించిన స్కెచ్చులు వాడుతున్నారు.  పోలీసులకు చిక్కకుండా భారీగా గంజాయిని తరలించే ఏకైక లక్ష్యంతో ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ ముందుకు సాగుతున్నారు. ఒకవేళ కాప్స్‌కి చిక్కి జైలుకు వెళ్లినా.. తిరిగివచ్చి మళ్లీ అదే దందాలకు పాల్పడుతున్నారు. శతకోటి దరిద్రాలకు అనంత కోటి మార్గాలు అన్నట్టు.. ఈ కేటుగాళ్లు ఎత్తులు ఉంటున్నాయి. తాజాగా ఓ మైదాన ప్రాంతంలో ఓ టూరిస్ట్ బస్సు పార్క్ చేసి ఉంచడాన్ని అటుగా వెళ్లే రైతులు గమనించారు. కానీ లోపల ఎవరూ లేరు. చుట్టూ చెక్ చేయగా.. బస్సు కింద అనుమానాస్పద మూటలు కనిపించాయి. దీంతో టెన్షన్ పడ్డ రైతులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన కేరళ(Kerala) త్రిసూర్‌(Thrissur) సమీపంలోని చెమ్మపిల్లి అనేశ్వరం ఆలయ సమీపంలో చోటుచేసుకుంది. వెంటనే  అంతిక్కడ్ పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. బస్సు కింద నాలుగు అనుమానాస్పద ప్యాకేజీలను ఓపెన్ చేసి లోపల ఉంది.. గంజాయిగా గుర్తించారు. మొత్తం తొమ్మిది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని ఎవరు దాచారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. పోలీసు తనిఖీలకు భయపడి.. బస్సును అక్కడ వదిలేసి ఉండవచ్చని అనుమానిస్తుున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

జాతీయ వార్తల కోసం