షోపియాన్‌ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతం

| Edited By:

Jun 10, 2020 | 9:00 PM

బుధవారం నాడు జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతమైనట్లు జమ్ముకశ్మీర్‌ పోలీసులు తెలిపారు. షోపియాన్ జిల్లాలోని సుగో ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు.

షోపియాన్‌ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతం
Follow us on

బుధవారం నాడు జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతమైనట్లు జమ్ముకశ్మీర్‌ పోలీసులు తెలిపారు. షోపియాన్ జిల్లాలోని సుగో ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు. షోపియాన్ జిల్లా పోలీసులకు సుగో ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారం అందడంతో.. పోలీసులు, సీఆర్పీఎఫ్, రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో వీరిని గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురు కాల్పులు చేపట్టాయి. దాదాపు మూడు గంటలకు పైగా ఎన్‌కౌంటర్‌ కొనసాగింది. చివరకు ఐదుగురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టినట్లు పోలీస్‌ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో సైన్యానికి ఎలాంటి నష్టం వాటిల్లలేదని తెలిపారు. మరణించిన ఉగ్రవాదులు లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దిన్‌కు చెందిన వారిగా గుర్తించారు. వీరిలో ఒకరు మోస్ట్ వాంటెడ్‌ ఉగ్రవాది అని తెలిపారు.

కాగా, గడిచిన మూడు రోజుల్లో జరిగిన పలు ఎన్‌కౌంటర్‌లో మొత్తం 14 మంది ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపారు. ఈ ఘటనల్లో పెద్ద ఎత్తున ఆయుధాలతో పాటు, మందుగుండు సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.