ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం కరోనా భయంతో వణికిపోతున్న విషయం తెలిసిందే. మన దేశంలో కూడా కరోనా మహ్మారి విజృంభిస్తోంది. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితమైపోయారు. ఈ క్రమంలో ఉత్తర భారతంలో లాక్డౌన్ సమయంలో మరో భయంతో వణికిపోతున్నారు. ఇప్పటికే ఓ సారి దేశ రాజధాని ఢిల్లీలో స్వల్పంగా భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. తాజగా మంగళవారం హిమాచల్ ప్రదేశ్లో కూడా స్వల్పంగా భూమి కంపించింది. మధ్యాహ్నం 12.17 నిమిషాలకు చంబా ప్రాంతంలో భూ ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. రిక్టార్ స్కేల్పై భూకంప తీవ్రత 4.0 గా నమోదైంది. కాగా చంబా ప్రాంతంలో గతంలో కూడా స్వల్పంగా భూకంపం వచ్చింది.
An earthquake with a magnitude of 4.0 on the Richter Scale hit Chamba region today at around 12:17 pm: Himachal Pradesh
— ANI (@ANI) April 28, 2020