లారీ డ్రైవర్ నిర్లక్ష్యం.. పరీక్ష రాసేందుకు వెళ్తూ ఇద్దరు దుర్మరణం

ఓ లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యంతో ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిశాయి. పరీక్ష రాసేందుకు బైక్‌పై వెళ్తున్న ఇద్దరు విద్యార్థులను లారీ వెనుక నుంచి డీకొట్టింది. దీంతో ఇద్దరూ అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు.

లారీ డ్రైవర్ నిర్లక్ష్యం.. పరీక్ష రాసేందుకు వెళ్తూ ఇద్దరు దుర్మరణం
Follow us

|

Updated on: Oct 04, 2020 | 11:53 AM

ఓ లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యంతో ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిశాయి. పరీక్ష రాసేందుకు బైక్‌పై వెళ్తున్న ఇద్దరు విద్యార్థులను లారీ వెనుక నుంచి డీకొట్టింది. దీంతో ఇద్దరూ అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జహీరాబాద్‌కు చెందిన శ్వేతా, శ్రీనివాస్‌ డైట్‌సెట్‌ పరీక్ష రాసేందుకు ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని ఓ పరీక్ష కేంద్రానికి బైక్‌పై వెళ్తున్నారు. మదీనాగూడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ వారు ప్రయాణిస్తున్న బైక్‌ను బలంగా ఢీ కొట్టింది. ఇద్దరు ఇద్దరూ రోడ్డుపై చెల్లాచెదురుగా పడి మృతిచెందారు. కాగా, శ్వేతకు వివాహమై, ఒక బాబు కూడా ఉన్నాడు.

లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగానే వీరిద్దరు మృత్యువాత పడినట్లు స్థానికుల తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న మియాపూర్ పోలీసులు.. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పరీక్ష రాసేందుకు వెళ్లిన తమ పిల్లలు ఇక తిరిగిరాదనే చేదు నిజం వారిని విషాదంలో ముంచింది.