ఏపీ: మరో వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా..!
ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఈ మహమ్మారి బారిన పడుతున్న రాజకీయ నేతల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
Proddatur MLA Tests Corona Positive: ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఈ మహమ్మారి బారిన పడుతున్న రాజకీయ నేతల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం అంజద్ బాషాతో పాటు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సహా పలువురు వైసీపీ ఎమ్మెల్యేలకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఇందులో కొంతమంది కోలుకోగా, మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇంకొందరు హోం ఐసోలేషన్లో ఉన్నారు.
ఇక తాజాగా కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్కి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయన టెస్టులు చేయించుకోగా.. పాజిటివ్గా తేలింది. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్లో ఉన్న ఆయన.. డాక్టర్ల పర్యవేక్షణలో ఇంటి దగ్గర నుంచే చికిత్స తీసుకుంటున్నారు. కాగా, గత కొద్దిరోజులుగా తనతో కాంటాక్ట్ అయినవారు స్వీయ నిర్బంధంలో ఉండాలని శివప్రసాద్ సూచించారు.
Also Read:
ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ రోజే ‘జగనన్న విద్యా కానుక’..