మాకే ప్రజావేదిక.. వైసీపీ డిమాండ్!

|

Jun 06, 2019 | 12:33 PM

ప్రజావేదిక విషయంలో చంద్రబాబుకి వైసీపీ షాక్ ఇచ్చింది. ప్రతిపక్ష నేత హోదాలో అధికారిక కార్యకలాపాల కోసం ప్రజావేదికను తనకు కేటాయించాలని సీఎం జగన్ కు చంద్రబాబు ఇప్పటికే లేఖ రాయగా.. ఆయనకు కౌంటర్ ఇస్తూ వైసీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు లేఖ రాశారు. పార్టీ-ప్రభుత్వం మధ్య సమన్వయం కోసం కార్యక్రమాలకు ప్రజావేదిక అనువుగా ఉంటుందని ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రజావేదిక అక్రమకట్టడమని అధికారులు నిర్దారిస్తే.. తక్షణం ఖాళీ […]

మాకే ప్రజావేదిక.. వైసీపీ డిమాండ్!
Follow us on

ప్రజావేదిక విషయంలో చంద్రబాబుకి వైసీపీ షాక్ ఇచ్చింది. ప్రతిపక్ష నేత హోదాలో అధికారిక కార్యకలాపాల కోసం ప్రజావేదికను తనకు కేటాయించాలని సీఎం జగన్ కు చంద్రబాబు ఇప్పటికే లేఖ రాయగా.. ఆయనకు కౌంటర్ ఇస్తూ వైసీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు లేఖ రాశారు. పార్టీ-ప్రభుత్వం మధ్య సమన్వయం కోసం కార్యక్రమాలకు ప్రజావేదిక అనువుగా ఉంటుందని ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రజావేదిక అక్రమకట్టడమని అధికారులు నిర్దారిస్తే.. తక్షణం ఖాళీ చేసి ఇవ్వడానికి సిద్ధమన్నట్లు రఘురాం తెలిపారు. టీడీపీ, వైసీపీలు ప్రజావేదికను తమకే కేటాయించాలంటూ కోరుతుండడంతో ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి  నెలకొంది.