వివేకా హత్య కేసులో కీలక మలుపు.. వైఎస్ ఫ్యామిలీతో పాటు..

| Edited By: Pardhasaradhi Peri

Aug 30, 2019 | 11:36 AM

మాజీ ఎంపీ వైఎస్ వివేకా హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. కాల్‌ డేటా ఆధారంగా విచారణ చేస్తోన్న సిట్.. వైఎస్ కుటుంబసభ్యులను విచారిస్తోంది. వీరితో పాటు జమ్మలమడుగు వైసీపీ, నేతలు కార్యకర్తలను సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. కాగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, జగన్ చిన్నాన్న అయిన వివేకా ఈ ఏడాది మార్చి 15న మరణించారు. గుండెపోటుతో వివేకా మరణించారని మొదట అనుకున్నా.. ఆ తరువాత ఆయన శరీరంపై గాయాలు ఉండటంతో హత్యగా తేలింది. […]

వివేకా హత్య కేసులో కీలక మలుపు.. వైఎస్ ఫ్యామిలీతో పాటు..
Follow us on

మాజీ ఎంపీ వైఎస్ వివేకా హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. కాల్‌ డేటా ఆధారంగా విచారణ చేస్తోన్న సిట్.. వైఎస్ కుటుంబసభ్యులను విచారిస్తోంది. వీరితో పాటు జమ్మలమడుగు వైసీపీ, నేతలు కార్యకర్తలను సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు.

కాగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, జగన్ చిన్నాన్న అయిన వివేకా ఈ ఏడాది మార్చి 15న మరణించారు. గుండెపోటుతో వివేకా మరణించారని మొదట అనుకున్నా.. ఆ తరువాత ఆయన శరీరంపై గాయాలు ఉండటంతో హత్యగా తేలింది. ఇక పోస్ట్‌మార్టంలో సైతం హత్య అని తేలడంతో.. ఈ కేసును అప్పటి చంద్రబాబు ప్రభుత్వం సిట్ అధికారులకు అప్పగించింది.