బ్రేకింగ్ : వివేకా హత్య కేసులో అనుమానితుడు ఆత్మహత్య

| Edited By:

Sep 03, 2019 | 11:32 AM

వైఎస్ వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాసులు రెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కడప జిల్లా సింహాద్రిపురం మండలానికి చెందిన శ్రీనివాసులు రెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో వెంటనే ఆయన కుటుంబ సభ్యులు స్థానికి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో పోలీసులు విచారణకు పిలిచారని.. పోలీసుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ […]

బ్రేకింగ్ : వివేకా హత్య కేసులో అనుమానితుడు ఆత్మహత్య
Follow us on

వైఎస్ వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాసులు రెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కడప జిల్లా సింహాద్రిపురం మండలానికి చెందిన శ్రీనివాసులు రెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో వెంటనే ఆయన కుటుంబ సభ్యులు స్థానికి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో పోలీసులు విచారణకు పిలిచారని.. పోలీసుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాసిపెట్టాడు. తనకు హత్యతో సంబంధం లేదని మూడు లెటర్లు రాసిన శ్రీనివాస్ రెడ్డి.. సిట్ సీఐ శ్రీరామ్ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. అయితే వివేకా హత్య కేసులో ప్రధాన అనుమానితుడైన కసునూరి పరమేశ్వర్ రెడ్డికి శ్రీనివాస్ రెడ్డి బావమరిది.