మాజీమంత్రి, ఏపీ సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ మూడో రోజు కొనసాగుతోంది. కడప జిల్లా పులివెందులలో మకాం వేసిన సీబీఐ అధికారులు… వివేకా హత్య కేసుపై విచారణ జరుపుతున్నారు. పులివెందుల రింగు రోడ్డు పరిసర ప్రాంతాలను పరిశీలించిన అధికారులు, డీఎస్పీ ఆఫీసులో కేసు వివరాలను తెలుసుకున్నారు. ఇద్దరు సీబీఐ అధికారులు పులివెందుల కోర్టుకు వెళ్లారు. అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్కు పిటిషన్ అందజేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ పిటిషన్ మూడు రోజుల తర్వాత తెరిచే వీలుందని సంబంధిత వర్గాలు అంటున్నాయి.
ఆ పిటిషన్లో ఏ వివరాలు ఉన్నాయన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వివేకా మర్డర్ కేసులో ముఖ్యులను విచారించడానికా… లేక కోర్టు పర్మిషన్ తో ఎవరినైనా ప్రశ్నించడానికి పిటిషన్ వేశారా అనేది తెలియాల్సి ఉంది.
Also Read :
విషాదం : చిన్నారి ప్రాణం తీసిన బిస్కెట్
అరకు ఎంపీ గొడ్డేటి మాధవికి కరోనా పాజిటివ్