ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజునే కొన్ని కీలకమైన ప్రకటనలు చేసేందుకు జగన్ సమాయత్తమైనట్లు సమాచారం. ఇప్పటికే ఈ అంశాలపై మాజీ సీఎస్ అజయ్ కల్లంతో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. నవరత్నాల అమలుకు సంబంధించి కీలక ప్రకటనలు చేయడంతోపాటు.. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నందున ఆర్థిక అంశాల్లో, క్రమశిక్షణ విషయంలోనూ ప్రకటనలు చేయనున్నట్లు సమాచారం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా శాఖలవారీగా సంక్షిప్తంగా సమాచారాన్ని జగన్కు అందించారు. పోలవరం ప్రాజెక్టుపై జగన్ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.