మోదీకి అభినందనలు తెలిపిన తలైవా!

2019 పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రభంజనం సృష్టిస్తోంది. 542 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రస్తుతానికి 342కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 2014 ఎన్నికలతో పోలీస్తే.. ఈసారి బీజేపీ భారీ మెజారిటీతో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా బీజేపీకి, ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రధాని మోదీని అభినందిస్తూ.. ట్వీట్ చేశారు. ‘‘గౌరవనీయులైన ప్రియమైన నరేంద్ర మోదీజీ అభినందనలు. మీరు మళ్లీ సాధించారు. దేవుడు మిమ్మల్ని […]

మోదీకి అభినందనలు తెలిపిన తలైవా!
Follow us

| Edited By:

Updated on: May 23, 2019 | 3:27 PM

2019 పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రభంజనం సృష్టిస్తోంది. 542 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రస్తుతానికి 342కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 2014 ఎన్నికలతో పోలీస్తే.. ఈసారి బీజేపీ భారీ మెజారిటీతో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా బీజేపీకి, ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రధాని మోదీని అభినందిస్తూ.. ట్వీట్ చేశారు. ‘‘గౌరవనీయులైన ప్రియమైన నరేంద్ర మోదీజీ అభినందనలు. మీరు మళ్లీ సాధించారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి’’ అంటూ రజనీకాంత్ ట్వీట్ చేశారు. రజనీకాంత్‌తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖలు మోదీకి అభినందనలు తెలిపారు.