టీడీపీ నేతల కార్ల దాడిపై పిన్నెళ్లి రియాక్షన్

| Edited By:

Mar 11, 2020 | 2:22 PM

గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నేతల దాడిపై స్పందించారు వైసీపీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణా రెడ్డి. టీడీపీ నేతల వాహనాలు ఒక పిల్లాడిని ఢీ కొట్టి వెళ్లిపోయాయని..

టీడీపీ నేతల కార్ల దాడిపై పిన్నెళ్లి రియాక్షన్
Follow us on

గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నేతల దాడిపై స్పందించారు వైసీపీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణా రెడ్డి. టీడీపీ నేతల వాహనాలు ఒక పిల్లాడిని ఢీ కొట్టి వెళ్లిపోయాయని.. దాంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారని వివరించారు. అంతేకాకుండా స్థానికులతో టీడీపీ నేతలు దుర్భాషలాడారు. కావాలనే పల్నాడులో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేందుకే.. టీడీపీ నేతలు ప్రయత్నించారని.. విమర్శించారు పిన్నెళ్లి రామకృష్ణా రెడ్డి. విజయవాడ నుంచి పది కార్లలో.. బోండా ఉమ, బుద్ధా వెంకన్న లాంటి గూండాలను మాచర్లకు చంద్రబాబు పంపించారని ఆరోపించారు. రైతుల ముసుగులో తనను హత్య చేయడానికి ప్రయత్నించారని అయినా తాము సంయమనంతో ఉన్నామని పేర్కొన్నారు పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి.

ఇది కూడా చదవండి: టీడీపీ నేతల కారుపై దాడి.. చంద్రబాబు ఫైర్

Read More: వేలానికి మాజీ మంత్రి గంటా ఆస్తులు..

Read More this also: లాయర్ తల పగిలింది.. మేము ప్రాణాలతో.. వస్తామో.. రామో..