YCP MLA Alla comments: ఓటుకు నోటు కేసుపై వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

| Edited By: Pardhasaradhi Peri

Jan 02, 2021 | 1:47 PM

వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాజీ సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

YCP MLA Alla comments:  ఓటుకు నోటు కేసుపై  వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
Follow us on

ఓటుకు నోటు కేసులో ఏపీలో మరోసారి ప్రకంపనలు సృష్టిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు పాత్ర మరోసారి స్పష్టమైందని రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబే ప్రధాన నిందితుడన్న రామకృష్ణారెడ్డి.. వ్యవస్థలను ఎల్లకాలం చంద్రబాబు మేనేజ్ చేయలేడని ఆరోపించారు.

ఇదిలావుంటే, ఈ కేసులో నిందితుడైన జెరూసలేం మత్తయ్య ఈడీ ఎదుట హాజరై తాజాగా వాంగ్మూలం ఇచ్చినట్లుగా సోషల్ మీడియాలో ఓ స్టేట్ మెంట్ కాపీ వైరల్ అవుతోంది. చంద్రబాబు సమక్షంలోనే ఓటుకు నోటు ఒప్పందం కుదిరిందని ఆయన అంగీకరించినట్లు తెలుస్తోంది. స్టీఫెన్‌ సన్‌కు రూ.5 కోట్లు ఇస్తామని అడ్వాన్స్‌గా రూ.50 లక్షలు ఇస్తానని చంద్రబాబు తనతో చెప్పారని వాంగ్మూలంలో పేర్కొన్నట్లు సమాచారం. మత్తయ్య వాగ్మూలాన్ని ఈడీ రికార్డ్ చేసింది. చంద్రబాబు డైరెక్టన్‌లోనే రేవంత్‌ రెడ్డితో కలిసి స్టీఫెన్ సన్‌ను ప్రలోభపెట్టినట్టు మత్తయ్య ఒప్పుకున్నట్లు సమాచారం.