బీజేపీపై సంచలన వ్యాఖ్యలు: ఉత్పల్ పారికర్

| Edited By:

Jul 11, 2019 | 4:50 PM

దివంగత ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్ పారికర్.. బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ తన సిద్ధాంతాలను మర్చిపోయిందని.. కొత్త దారుల్లో వెళుతోందని విమర్శించారు. గోవా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 15 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా.. వారిలో 10 మంది బుధవారం బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అంతేగాక తమ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉత్పల్ మాట్లాడుతూ.. ‘‘మా నాన్న నాటి పార్టీ కాదిది. విశ్వాసం, నిబద్ధత పునాదులుగా […]

బీజేపీపై సంచలన వ్యాఖ్యలు: ఉత్పల్ పారికర్
Follow us on

దివంగత ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్ పారికర్.. బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ తన సిద్ధాంతాలను మర్చిపోయిందని.. కొత్త దారుల్లో వెళుతోందని విమర్శించారు. గోవా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 15 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా.. వారిలో 10 మంది బుధవారం బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అంతేగాక తమ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉత్పల్ మాట్లాడుతూ.. ‘‘మా నాన్న నాటి పార్టీ కాదిది. విశ్వాసం, నిబద్ధత పునాదులుగా పార్టీ నడిచేది. మార్చి 17 తర్వాత ఆ రెండు పదాలు పార్టీకి దూరమయ్యాయి. పార్టీ తన పంథాను పూర్తిగా మార్చుకుంది. చెప్పే సమయమని భావించి చెబుతున్నాను’’ అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.