నందనవనంలో మహిళ దారుణహత్య

|

Oct 09, 2020 | 1:50 PM

హైదరాబాద్ న‌గ‌రంలోని ఎల్ బీ న‌గ‌ర్‌లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. గుర్తు తెలియని దుండగులు మహిళ గొంతు కోసి హతమార్చినట్లు పోలీసులు తెలిపారు.

నందనవనంలో మహిళ దారుణహత్య
Follow us on

హైదరాబాద్ న‌గ‌రంలోని ఎల్ బీ న‌గ‌ర్‌లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. గుర్తు తెలియని దుండగులు మహిళ గొంతు కోసి హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు మీర్ పేట్ పోలీసులు తెలిపారు. నందనవనం సమీపంలోని ఇంద్రసేనారెడ్డినగర్‌ బస్తీలో మహిళ హత్యకు గురైంది. దేవరకొండకు చెందిన ఓ మహిళ(32) భర్త చనిపోవడంతో కొన్నాళ్ల క్రితం 13 ఏళ్ల కొడుకుతో కలిసి కూలిపని చేసుకుంటూ నివాసముంటోంది. ఇదే క్రమంలో జిల్లెలగూడ గాయత్రినగర్‌కు చెందిన పోరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడిందని పోలీసులు తెలిపారు. అతడు తరచుగా మహిళ ఇంటికి వచ్చేవాడని, రాత్రిపూట కూడా అక్కడే ఉండేవాడని తెలిపారు. కాగా గురువారం తెల్లారేసరికి ఆమె తన ఇంట్లో చనిపోయి కనిపించింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. కాగా, శ్రీకాంత్‌రెడ్డి బుధవారం రాత్రి మహిళ ఇంటికి వచ్చినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం.

జిల్లెలగూడ గాయత్రినగర్‌కు చెందిన పోరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతడు తరచుగా మహిళ ఇంటికి వచ్చేవాడని, రాత్రిపూట కూడా అక్కడే ఉండేవాడని స్థానికులు చెబుతున్నారు. శ్రీకాంత్‌రెడ్డి బుధవారం రాత్రి మహిళ ఇంటికి వచ్చినట్లు తెలిసింది. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు శ్రీకాంత్ రెడ్డిని అదుపులోకి విచారణ చేపట్టారు. అయితే, తెల్లవారు జామున మూడు గంటలకు తాను లేచి చూడగా మహిళ విగతజీవిగా కనిపించిందని శ్రీకాంత్‌రెడ్డి పోలీసులకు చెప్పాడు.

మృతురాలి గొంతు నులిమినట్లు, మెడపై గాయాలు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో ఆమెది హత్యేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. తనకు మహిళతో వివాహేతర సంబంధం ఉన్న మాట వాస్తవమేనని, ఆమెను తాను చంపలేదని శ్రీకాంత్‌రెడ్డి చెబుతున్నట్టు సమాచారం. రాత్రంతా అక్కడే ఉన్న అతడికి తెలియకుండా ఆమెను ఎవరు చంపుతారని, ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి మద్యం మత్తులో అతడే చంపి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, త్వరలో వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.