ఆర్థిక రంగాన్ని ఎవరు కాపాడతారు?: శతృఘ్న సిన్హా

| Edited By: Anil kumar poka

Aug 27, 2019 | 6:50 AM

స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగానికి గానూ ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించి పది రోజులు గడవక ముందే కేంద్రంపై కాంగ్రెస్‌ నేత శతృఘ్న సిన్హా విమర్శల వర్షం కురిపించారు. దేశ ఆర్థిక పరిస్థితిపై ఆయన వరుస ట్వీట్లు చేశారు. ప్రస్తుతం ఏ ప్రసంగం విన్నా దేశ ఆర్థిక మందగమనం గురించే ఉందని అన్నారు. ‘సర్‌..ప్రస్తుతం ప్రతి ఒక్కరూ దేశ ఆర్థిక స్థితిపైనే మాట్లాడుతున్నారు. మనం దీని గురించి ఆలోచించలేమా? ఆర్థిక సంస్థలు, మార్కెట్లు ఊగిసలాడుతున్నాయి. ప్రైవేటు సెక్టార్ పరిస్థితి […]

ఆర్థిక రంగాన్ని ఎవరు కాపాడతారు?: శతృఘ్న సిన్హా
Follow us on

స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగానికి గానూ ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించి పది రోజులు గడవక ముందే కేంద్రంపై కాంగ్రెస్‌ నేత శతృఘ్న సిన్హా విమర్శల వర్షం కురిపించారు. దేశ ఆర్థిక పరిస్థితిపై ఆయన వరుస ట్వీట్లు చేశారు. ప్రస్తుతం ఏ ప్రసంగం విన్నా దేశ ఆర్థిక మందగమనం గురించే ఉందని అన్నారు.

‘సర్‌..ప్రస్తుతం ప్రతి ఒక్కరూ దేశ ఆర్థిక స్థితిపైనే మాట్లాడుతున్నారు. మనం దీని గురించి ఆలోచించలేమా? ఆర్థిక సంస్థలు, మార్కెట్లు ఊగిసలాడుతున్నాయి. ప్రైవేటు సెక్టార్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఇప్పుడు మీరు దీనిపై చర్యలు తీసుకోగలిగితే భవిష్యత్తులో ఈ తీవ్రత తగ్గుతుంది. లేకపోతే వ్యవసాయం నుంచి ఆటోమొబైల్స్‌ వరకు, సబ్బుల నుంచి షాంపూల వరకు, వస్త్రాల నుంచి బిస్కెట్ల వరకు అన్నింటిపైనా వీటి ప్రభావం ఉంటుంది. ఉత్పత్తి తగ్గిపోతుంది. పౌర విమానయానం, ఆటోమొబైల్‌, నాన్‌ బ్యాంకింగ్‌ సర్వీసులు, నిత్యావసరాల పరిశ్రమలు తీవ్రంగా నష్టపోతాయి’

‘ఈ స్థితి వల్ల 45ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా నిరుద్యోగిత 6% పెరుగుతుంది. ఫలితంగా 30 మిలియన్ల మంది నిరుద్యోగులవుతారు. మునుపెన్నడూ లేని విధంగా విమానయాన రంగం సంక్షోభంలో కొట్టు మిట్టాడుతోంది. ఈ పరిస్థితికి కారణం ఏమిటి? నోట్ల రద్దా? జీఎస్టీయా?విధానాలా?. ఆర్థిక రంగాన్ని ఎవరు కాపాడతారు?. మీరు ఈ అంశాల్లో సరైన సంస్కరణలు తీసుకొస్తే అందుకు మా సాయం ఎప్పుడూ ఉంటుంది’ అని ట్వీట్లు చేశారు.