విండీస్ పేస్ బౌలర్ ఒషానె థామస్.. రోడ్డు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. ఆదివారం జరిగిన ప్రమాదంలో.. థామస్ ప్రయాణిస్తున్న వాహనాన్ని మరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో థామస్కు స్వల్పగాయాలయ్యాయి. ఈ విషయాన్ని వెస్టిండీస్ ప్లేయర్స్ అసోషియేషన్ తెలిపింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం.. థామస్ తన స్వగృహానికి వెళ్లి.. విశ్రాంతి తీసుకుంటున్నట్లు..వెస్టిండీస్ ప్లేయర్స్ అసోషియేషన్ పేర్కొంది. థామస్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని తెలిపింది. థామస్ తన చివరి మ్యాచ్ జనవరి 12వ తేదీన ఐర్లాండ్తో ఆడాడు. వెస్టిండీస్ తరఫున ఇప్పటి వరకు 19 వన్డేలు, 10 టీ20లు ఆడిన థామస్.. వన్డేల్లో 27 వికెట్లు, టీ20ల్లో 9 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు.. ఐపీఎల్లో థామస్.. రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.