కావాలంటే.. చంద్రబాబు ఇంటికి కూడా వైసీపీ రంగులు వేస్తాం: జోగి రమేష్

| Edited By: Srinu

Oct 12, 2019 | 5:09 PM

కావాలంటే.. మాజీ సీఎం చంద్రబాబు ఇంటికి కూడా వైసీపీ రంగులు వేస్తామంటూ.. వైసీపీ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ సంచలన కామెంట్స్ చేశారు. తాజాగా.. ఆంధ్రప్రదేశ్‌లోని పంచాయతీ భవనాలన్నింటికీ.. వైసీపీ పార్టీ రంగులు వేస్తోన్న సంగతి తెలిసిందే. దీనిపై గత కొద్ది రోజులుగా టీడీపీ-వైసీపీ పార్టీల మధ్య రచ్చ జరుగుతూనే ఉంది. కానీ.. తాజాగా జరిగిన ఈ వాగ్వాదంలో వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఈ విధమైన షాకింగ్ కామెంట్స్ చేశారు. రైతు భరోసా అంశంపై కృష్ణా […]

కావాలంటే.. చంద్రబాబు ఇంటికి కూడా వైసీపీ రంగులు వేస్తాం: జోగి రమేష్
Follow us on

కావాలంటే.. మాజీ సీఎం చంద్రబాబు ఇంటికి కూడా వైసీపీ రంగులు వేస్తామంటూ.. వైసీపీ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ సంచలన కామెంట్స్ చేశారు. తాజాగా.. ఆంధ్రప్రదేశ్‌లోని పంచాయతీ భవనాలన్నింటికీ.. వైసీపీ పార్టీ రంగులు వేస్తోన్న సంగతి తెలిసిందే. దీనిపై గత కొద్ది రోజులుగా టీడీపీ-వైసీపీ పార్టీల మధ్య రచ్చ జరుగుతూనే ఉంది. కానీ.. తాజాగా జరిగిన ఈ వాగ్వాదంలో వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఈ విధమైన షాకింగ్ కామెంట్స్ చేశారు.

రైతు భరోసా అంశంపై కృష్ణా జిల్లాలో తాజాగా సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత వైవీబీ, జోగి రమేష్‌ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సమీక్షా సమావేశంలో.. జోగి రమేష్ మాట్లాడుతున్న సమయంలో వైవీబీ లేచి.. రుణమాఫీని రద్దు చేస్తూ.. ప్రభుత్వం ఇచ్చిన తీర్పుతో.. రైతులు నష్టపోయారని అన్నారు. అలాగే.. పంచాయతీ భవనాలన్నింటీకీ.. వైసీసీ పార్టీ రంగులు వేయిస్తున్నారని.. ఆ అధికారం మీకు ఎవరిచ్చారని జోగిని ఉద్ధేశిస్తూ ప్రశ్నించారు.

ఇందుకు సమాధానంగా.. జోగి.. ‘నేను మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడకూడదు కూర్చోవోయ్.. నిన్ను కొడతా’ అంటూ వైవీబీని ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. కావాలంటే.. చంద్రబాబు ఇంటికి కూడా.. వైసీపీ పార్టీ రంగులు వేయిస్తాం.. ఏం చేసుకుంటావో.. చేసుకో అంటూ.. షాకింగ్ కామెంట్స్.. చేశారు. దీంతో.. పలు వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి.